28, మార్చి 2012, బుధవారం

౨౭మార్చి౨౦౧౨, మంగళవారం

నిన్న ఈనాడు వాహిని లో రాత్రి ౯.౩౦కి వచ్చిన "పాడుతా తీయగా"-(చిన్నారుల సంచిక) రాజమండ్రిలో నిర్వహించారు.
రాజమండ్రి గురించి వాహినిలో ఎప్పుడు వచ్చినా, చిన్ననాటి గుర్తులు వస్తూ వుంటాయి. ఆ రోజుల్లో "సెంట్ అన్న్స్" బడికి ఒక చిన్న రిక్షాలో వెళుతూ అక్కడి మిత్రులతో సరదాగా గడిపిన సమయం, తరగతుల్లో ఆటపట్టించటం, వగైరా మదిలోకి వస్తాయి. "ఉప్పొంగెలే గోదావరి" అనే పాట అయితే ఎన్ని అనుభూతుల్ని తెస్తుందో చెప్పలేను.
ఒక సారి గోదావరిలో పడవ మీద పట్టుసీమ వెళ్ళాము. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ నన్ను వెంటాడుతూ వుంటాయి.
రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళే ధూమశకటంలో ప్రయాణిస్తున్నప్పుడు గోదావరి నది మీద కుండా వెళ్ళాలి. అప్పుడు నదిలో రూపాయి బిళ్ళ వేసేవాళ్ళం! అప్పట్లో అదొక నమ్మకం!
అలాగే ఇంటి వెనక వున్నపెరట్లో వున్న జామచెట్టు ఎక్కటం అంటే నాకు ఎంతో ఇష్టం! అదేదో ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషంగా వుండేది! వేసవి కాలంలో ఎక్కడో దొరికిన ఒక చాపని బుల్బ్ లో నీళ్ళు పోసి ఆడించాను! అదే నేను చూసిన, ఆడుకున్న మొదటి "ఆక్వేరియం"! ఇదే సమయం లో నాకు బొమ్మలు గీయటమన్నా, చలన చిత్రాలన్నా ఇష్టం పెరిగింది!
ఎప్పుడో ఆంగ్లేయుల కాలం నాడు మన కోసం ఒక కట్ట(ధవళేశ్వరం బారేజి) కట్టాడని ఆ ఆర్థర్ కాటన్ ని ఇప్పటికీ అభిమానించే ఊరు ఇది!. ఎప్పటికైనా మళ్ల్లీ గోదావరి తీరానికి చేరాలని వుంది...

..మీ అనిల్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ వ్యక్తిగత పత్రిక పైన మీ అభిప్రాయాలను నాకు తెలియచేయండి! సాధ్యమైనంతవరకు అభిప్రాయాలకు జవాబిస్తాను. కృతజ్ఞతలు!