22, ఆగస్టు 2013, గురువారం

స్వాతంత్రము, సురాజ్యము, సులోచనము

ఈ రోజుల్లో భారత దేశానికి స్వాతంత్ర్యం ముఖ్యమా, సురాజ్యం ముఖ్యమా అంటే సురజ్యమే ముఖ్యం అని చెప్పాలి.
సురాజ్యమంటే ఒక మంచి పాలనా పక్షాన్ని ఎంచుకుని ప్రజలందరూ ప్రభుత్వాన్ని మంచి దారిలో నడిపించటం.
రామరాజ్యం అంటే ఎప్పుడో రాముడు గొప్పగా పాలించిన రాజ్యం మాత్రమె కాదు. ఈ యుగం లో కూడా ఎంతో మంది రాముల్లు వున్నారు. ఎంతో మంది మంచి జనం వున్నారు. కాని కొంతమంది మూర్ఖుల తప్పుడు నిర్ణయాల వలన, తప్పు బాట వలన సరైన పాలనా యంత్రాంగాన్ని మన చేతుల్లోకి తెచ్చుకోలేకపోతున్నాం.
ఎలాగైతే ఒక పంట చేతికి రావటానికి ఏంటో మంది కృషి వుంటుందో, మన దేశం మన చేతికి రావటానికి ఎంతో మంది కృషి, సరైన ఆలోచనలు, మార్గాదర్సికాలు ముఖ్యం.
ఉదాహరణకి తాము చేస్తున్నది సరైనదా, కాదా అని తెలుసుకోలేని వ్యక్తి తమ ప్రభుత్వాన్ని ఎలా ఎంచుకుంటాడు?
జనానికి డబ్బు పారేస్తే వోట్లు వాళ్ళే వేస్తారని నాయకులందరికీ తెలుసు. అలాగే ప్రజలకు కూడా తప్పు-వొప్పు అనేవి తెలియకుండా మూడ నమ్మకాలతో పోతున్నారు తప్ప అసలు నిజం ఏంటి, అబద్ధం ఏంటి అనేది తెలుసుకోవట్లేదు.
తాము చేసే ప్రతి పనికీ ఒక ప్రతిఫలం వుంటుందని, దాన్ని చివరకు వాళ్ళే అనుభవించాలని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడు సురాజ్యం వచ్చినట్టు.
అప్పుడు మన ఈ స్వాతంత్ర్యానికి విలువ వుంటుంది.


..మీ అనిల్